అవసరం వస్తే ప్రజల కోసం ఎంతయినా చేసేందుకు ముందుకొస్తాము అంటున్నారు ముంబయ్ మేయర్ కిశోరీ పడ్నేకర్. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ఆమె నర్స్ గా విధుల నిర్వహణ లోకి వచ్చారు ముంబయ్ లోని నాయర్ ఆస్పత్రిలో రాత్రి వేళలో సేవలు అందిస్తున్నారు మేయర్  కిశోరీ పడ్నేకర్. కార్పోరేటర్ కాక  ముందు నాయర్ ఆస్పత్రిలోనే నర్స్ గా పని చేశారు కిశోరీ పడ్నేకర్. వాణిజ్య రాజధాని ముంబయ్ ప్రధమ మహిళ ఇలా నర్స్ దుస్తుల్లో రోగుల సేవకు ముందుకు రావటాన్ని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది అభినందించారు.

Leave a comment