ఇండియా టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ మధ్య ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ డైట్ విసయంలో తానేంతో జాగ్రత్తగా ఉందో ఎన్నో కబుర్లు చెప్పింది సానియా. డైట్ విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆకు కూరలు ,గ్రీన్ జ్యూస్ తీసుకొంటున్నా చాలా ఆరోగ్యవంతమైన ఆహారం గురించి ఎన్నో సలహాలు వింటున్నానని చెప్పింది సానియా. హైదరాబాద్ లోనే కుటుంబ సభ్యులతో ఆమె ప్రెగ్నెన్సీ టైమ్ ని చాలా సంతోషంగా గడుపుతోంది. బిడ్డ పుట్టాక 2020 లో టోక్యోలో జరిగే ఒలంపిక్స్ లో పాల్గొంటాను . రెండెళ్ళ గ్యాప్ లో అంటే కష్టమే కానీ నేను తప్పని సరిగా సాధిస్తా అంటోంది సానియా.

Leave a comment