ఓం ఓం అయ్యప్ప…ఓం కార రూప అయ్యప్ప!

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని అయ్యప్ప దేవాలయానికి వెళ్దాం పదండి.శబరిమలను తలపింపచేసే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.తలపై పాగా,మెడలో నిమ్మకాయల దండతో భక్తులకు దర్శనం ఇస్తారు.భక్తులు గంగా జలమును శిరస్సు పై పెట్టుకుని భక్తి పూర్వకంగా స్వామి వారి సన్నిధికి తీసుకొని రావటం ఇక్కడి విశేషం.18 మెట్లు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.శబరిమల వెళ్ళలేని భక్తులు తమ కోరికలు తీరేందుకు ఇక్కడికి వస్తారు.

అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభీషేకం చేసి తన్మయత్వం పొందుతారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, ఆవుపాలతో అభిషేకం.

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment