కర్ణాటకలోని మంగళూరు కు చెందిన సావిత్రి యక్షగాన ప్రదర్శనలు రాణిస్తున్నా మంచి నటి చిన్నతనంలోనే యక్ష గానం లో శిక్షణ ఇప్పించారు పెద్దలు. కానీ ఆమెను ప్రదర్శనలకు మాత్రం అంగీకరించలేదు. అలా తను నేర్చుకున్న కళకు దూరంగా ఉన్న సావిత్రి తన 66 వ ఏట రంగస్థలం పైన అడుగుపెట్టింది. టీచర్ గా పని చేస్తున్నాఆమె రిటైర్ అయ్యాక మంగళూరు లోని యక్షరాధన కళాకేంద్రం సాయం తో నాలుగైదు గంటలు విడివి తో సాగే నాటకాలను సాధన చేసింది. ఒక ఏడేళ్ల కాలంలో తన వందవ నాటకాన్ని ప్రదర్శించింది సావిత్రి. పౌరాణిక పాత్రల్లో ఎంతో చక్కగా ఒదిగి పోతారు సావిత్రి.

Leave a comment