పళ్ళు తెల్లగా మిలమిలా మెరిసిపోవాలంటే డెయిలీ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే పళ్ళు సహజంగానే శుభ్రపడతాయి. సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల పైన ఎలాంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి . స్ట్రాబెర్రీ కివి వంటి పండ్లు మరీ మంచివి . పాల ఉతప్తులు దంత క్షయాన్ని తగ్గిస్తాయి. ఎనామిల్ కు రక్షణ కల్పించటంలో బలోపేతం చేయటంలో హార్డ్ చీజ్ ఎంతో ఉపయోగపడుతుంది. నువ్వులు నాలుక పైన బాక్టీరియా ను నాశనం చేస్తుంది. అలాగే పళ్ళ ఎనామిల్ నిర్మాణానికి పనికివస్తుంది. తియ్యని పదార్ధాలు తిన్న తర్వాత పళ్లకు బ్రష్ చేయాలి. ఎసిడిక్ జ్యూస్ లు షోడాలు స్ట్రా తో తాగటం మంచిది. ఆహారం తిన్న తర్వాత నోరు శుభ్రం చేయాలి. ప్రతి మూడు నెలలకో టూత్ బ్రష్ మార్చితే చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటే డెంటల్ చెకప్ చేసుకోవాలి.

Leave a comment