తెలంగాణా పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ లు హైద్రాబాద్ ,కొండాపూర్,అల్వాల్ లో ఉన్నాయి . పిల్లలు అంటే బాలికలు,బాలురు మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే నమోదు చేయటం లో సహాయపడటం దగ్గర నుంచి తీర్పు వరకు ఒకే చోట అందించేందుకు ఏర్పడిందే భరోసా . మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది . ఏదైనా సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి న్యాయ విచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సలింగ్ కూడా ఉంటుంది . పిల్లలకు నిందితుడు కనిపించనీయకుండా చేసే ఏర్పాటు ఉంది . అవసరమైన పిల్లలకు పునరావాసం కలించే వీలుంది . ఈ భరోసా సెటర్లు బాధిత పిల్లలకు పూర్తి భరోసా ఇస్తాయి .

Leave a comment