మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను  నాలుగు గోడలకే  పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు పిలిచి వాళ్ళతో వాళ్ళ తల్లి తండ్రులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవాలి. పిల్లలతో వాళ్ళ స్నేహితులు ముచ్చట్లు తెలుసుకోవాలి. వాళ్ళ స్నేహితుల కోసం స్నాక్స్ చేసి ఇవ్వాలి. పిల్లల స్నేహితులతో ఆస్తులు అంతస్థుల గురించి అడగద్దు. సామాజికంగా అధికంగా వాళ్ళ కుటుంబం  ఏ స్థితి లో ఉన్న వాళ్ళు మన పిలల్లకు స్నేహితులని ఎప్పుడూ  మరచిపోవద్దు. అలాగే మన పిలల్ల మనసులో కూడా స్నేహాల మధ్య బాంధవ్యం మాత్రమే నిలిచివుండాలి కాని వాళ్ళ స్థితిగతులు కాదు. ఆ వైపుగా పిలల్లకు చక్కగా అర్ధమయేలా వివరించాలి. నీ స్నేహితుడు నాకు విలువైన వాడుగానీ అతని కుటుంబ విషయాలు కానేకాదని పిలల్లతో గట్టిగ చెప్పాలి.

Leave a comment