సాధారణంగా సౌర విద్యుత్ కేంద్రాలు,సౌర ఫలకాలు ఆరు బయట ఏర్పాటు చేస్తారు . తీవ్రమైన వేడిగాలులకు వాటి పనితీరు దెబ్బతింటుంది . అదే సౌర ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటుచేస్తే అత్యధిక స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి . పంటలు కూడా బాగా పండుతాయి . అంటే మనుషుల లాగా సౌర ఫలకాలు గాలి తగలాలి . చల్లగాలితో పాటు వాతావరణం పొడిగానూ ఉండాలి . వాతావరణంలోని తేమ వేడెక్కితే వాటి పనితీరు తగ్గిపోతుంది . అదే ఈ ఫలకాలు వ్యవసాయ భూముల్లో ఏర్పాటుచేస్తే ఎంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది . ఇది ఆచరణలోకి వస్తే విద్యుత్ శక్తి సమస్తీరిపోతుందంటున్నారు శాస్త్రజ్ఞులు .

Leave a comment