డాక్టర్ ఓజ్లెమ్ టూరేషి  డాక్టర్ ఉరుమ్ షాహీన్ లు కరోనా టీకా నూ కనిపెట్టారు సాంప్రదాయ వ్యాక్సిన్లు వైరస్ బలహీనం చేస్తాయి కానీ మేము తయారు చేసిన వ్యాక్సిన్ జన్యుల్లోనే మార్పు చేస్తుంది అంటున్నారీ దంపతులు ఇద్దరూ కలిసి 2001లో గానిమీడ్ అనే పేరుతో క్యాన్సర్ రీసెర్చ్ ల్యాబ్ లో స్థాపించారు. ౨౦౦౮లో బయో ఎన్ టెక్  సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం క్యాన్సర్ మందు తయారీ.శరీరంలోని జన్యువులను క్యాన్సర్ కణాలపై పోరాడేలా సిద్ధం చేసేందుకు మాలిక్యూల్ సముదాయాన్ని తయారు చేశారు.ఇప్పుడా మాలిక్యూల్ లోనే కరోనా వైరస్ ని తుదిముట్టించగలిగే   వ్యాక్సిన్ తయారు చేశారు.నాలుగు వందల మంది తో లైట్  స్పీడ్ అనే బృందాన్ని తయారు చేసుకొని వాక్సిన్ తయారి వేగంగా పూర్తి చేయగలిగారు.ఇందులో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 55 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.

Leave a comment