విశాఖపట్టణం మీదుగా విజయనగరం ,శ్రీకాకుళం,ఒడిసా,చత్తీస్ ఘడ్ వైపు రద్దీగా వెళ్ళే రైళ్ళలో అల్లరి మూకలు తాగుబోతులు ఈవ్ టీజర్స్ ఆట కట్టించేందుకు దక్షిణమధ్య రైల్వే మహిళల రక్షణ కోసం సుభద్రవాహిని పేరుతో 15 మందితో మహిళా రక్షక దళాన్ని ఏర్పాటు చేసింది. రాత్రివేళ ఆర్ పీఎఫ్ బ్యాంక్ లలో ఉండి అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉంటారు. సుభద్రవాహిని విధుల్లో భాగంగా కొందరు రైల్లో ప్రయాణిస్తారు.ఆడపిల్లల అక్రమ రవాణాకు గురి కాకుండా సిసి కెమెరాల పర్యవేక్షణ స్టేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించటం వీరి విధుల్లో భాగమే.

Leave a comment