ప్రపంచంలోనే మూడో ఎత్తయిన శిఖరం కాంచనగంగ (8586 మీటర్లు) అధిరోహించి రికార్డ్ సృష్టించింది మహారాష్ట్రలోని సతారా కు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోనే ఎనిమిది వేల మీటర్లకు పైగా ఉన్న 5 పర్వత శిఖరాలు అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది ప్రియాంక. టీనేజ్ లోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ లోనే బందర్ పంచ్ పర్వతశ్రేణి అధిరోహించింది ప్రియాంక. 2013 లో మౌంట్ ఎవరెస్ట్, 2016 లో మౌంట్ మకాలు,మౌంట్ కిలిమంజారో, మౌంట్ లోట్సే గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ పర్వతాలను అవలీలగా అధిరోహించింది ప్రియాంక మోహితే. కాంచన గంగ ఎక్కిన తొలి భారతీయ మహిళ కూడా ఆమె!

Leave a comment