మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అంచేత ప్రతిరోజూ ఒక మామిడి పండు చొప్పున తింటూ వుంటే నీరసం, నిస్సత్తువ రావు. అజీర్తి చేయదు. ఎక్కువ ఇరోన్వుంటుంది కాబట్టి రక్తహీనత పోతుంది. విటమిన్ ఎ, ఇ, సేలోనియంలు గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. సీజన్ అయిపోయేదాకా రోజుకో పండు తినేస్తేనే మంచిది.

Leave a comment