నీరసంగా ఉందా అంటే నీరు తాగండి అంటారు డాక్టర్స్ కానీ వట్టి నీళ్ళు మాత్రం తాగలేం అంటారు కొందరు . సరే అప్పుడు పల్చని జావలు ట్రై చేయండి అంటున్నారు . శరీరానికి చలువ చేసే జావలు కండరాల శక్తికి, ఎముకల పటుత్వానికి ఉపయోగ పడేలా చూసుకోవాలి అంటున్నారు. అలాంటి జావల్లో సగ్గుబియ్యం జావ ఎంతో మంచిది . సగ్గుబియ్యంతో ఎలక్ట్రో లైట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి . పల్చని జావ ప్రతి రోజు తాగవచ్చు ఎసిడిటి ,మలబద్దకం కూడా తగ్గిపోతాయి . తేలిగ్గా అరుగుతుంది . తక్షణ శక్తి రోజు ఇస్తుంది .

Leave a comment