నాకు రాయటం ఇష్టం. చాలా కాలంగా ఏమీ రాయటం లేదు ఈ లాక్ డౌన్ లో మళ్ళీ కలం పట్టుకున్న. ఒక పోస్ట్ చేశాను నేను తిండికి విలువ ఇవ్వటం నేర్చుకొన్నాననీ. మాములు రోజుల్లో,నన్ను మాచెల్లిని,మా నాన్న ఎంత మిస్ అవుతున్నారో తెలుసుకున్నాననీ. నా మనోభావాలు చాలా మార్చుకొన్నాననీ రాశాను. దాన్ని అందరు హర్షించరు అంటోంది జాన్వి కపూర్. నిజమే కదా మనుషులు ఎప్పుడు కొత్త విషయాలు అర్ధం చేసుకొని మారుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులకైనా అలవాటు పడటం ,సర్దుకు పోవటం,మనుషులకు మనసుందని తెలుసుకునేలా ఎన్నో అనుభావాలు ఇచ్చిందీ లాక్ డౌన్. సహనం తో ఉండటం నేర్చుకున్నాను నేను సంతోషంగా ఉండాలి అంటే సెట్ లో ఉంటేనే అనుకున్న….. కానీ జీవితం లో మన కెరీర్ ను మించిన సంతోషాలు ఎన్నో ఉన్నాయని అర్ధం అయింది అంటోంది జాన్వి కపూర్.

Leave a comment