మానస భజరే గురుచరణం…

దుష్టర భవ సాగర తరణం…
గురు మహా రాజ్..గురు జై జై…
సాయినాథ్ సద్గురు జై జై!!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు,లాయరుపేటలో వున్న సాయిబాబా వద్దకి వెళ్ళి అక్కడ బాబాయి దర్శించి,నైవేద్యం పెట్టి తరిద్దామా వనితలు!!
శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఈ స్ధలంలో సాయిబాబా వారిని పవిత్రమైన మంత్రోచ్ఛారణతో శాస్త్రీయంగా స్థాపించారు.అప్పటి నుండి ఇప్పటి వరకు వైభవంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం.

ప్రతి డిసెంబర్ లో దత్త జయంతి సందర్భంగా ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాలను నుండి వస్తారు.ఇక్కడ గణపతి, దత్తాత్రేయైడు,రాజరాజేశ్వరీ దేవి కొలువై వున్నారు.బాబావారి చావడి సేవ చూడటానికి రెండు కళ్ళుచాలవు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment