కాశీక్షేత్రం అతి పురాతనం. అడుగడుగునా శివలింగాల మాయం . కాశీలో దర్శించవలసిన ఆలయాల్లో దండ నాయకి అయిన వారాహి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించాలంటే ప్రాత సంధ్యకు ముందే వెళ్ళాలి. ఆమె క్షేత్రపాలిని గనుక రాత్రి సమయంలో జాగారం చేసి పగలు నిద్రపోతుందట . పొద్దు పొడిచే సమయానికి ఆమె తన నివాసానిక చేరుకొంటుంది అప్పుడు ఆమె అఖండ ధూపాలు నైవైద్యం ఇచ్చి నిద్రకు ఉపక్రమింపజేస్తారు. ఆమెకు నిద్రాభంగం కాకూడదని గుడి తలుపులు ముస్తారు. శక్తి స్వరూపిణి,కాశీక్షేత్ర రక్షకి అయిన వారాహి తప్పక చూడవలసిన దేవత.

Leave a comment