బంగారు వెండి ధగధగల్లో మెరిసిపోయే కంచి పట్టు చీరె ఇప్పుడు సంప్రదాయ వర్ణాలు అంచులలోంచి ఆధునిక వస్త్రశ్రేణిలోకి మారుతోంది. కుచ్చిళ్ళ దగ్గర జరీ బార్డర్ మోకాళ్ళ వరకు ఉండటం ఇవ్వాల్టి తాజా ఫ్యాషన్. ఆ జరీపైన సెల్ఫీ డిజైన్ చీరెల అందమే అందం. కొత్తగా వెండి రంగు చీరెలో వచ్చాయి. పూర్తిగా వెండి వెలుగులతో వెండి జరీతో ప్రత్యేకంగా కనిస్తోంది. ఇక తెల్లని వెండి చీరె హుందాతనంతో ఏ సందర్భానికైన అమరి పోతుంది. లైట్ ప్రింటెడ్ డిజైన్ శారీ ష్యాషన్ లుక్ ఇస్తోంది. తెల్లని ,గోధుమ రంగుకు కాంటాస్ట్ జరీ బార్డర్ కంచి చీరెను మరింత వెలుగుతో నింపుతోంది.

Leave a comment