ఓం నమో నమః !!

భువనగిరి సమీపంలో చిట్యాల లోని నాగర్ కర్నూల్లో స్వర్ణ లింగంతో దర్శనం ఇస్తున్నారు.ఇక్కడ లింగ మూర్తి 750 కిలోల బంగారంతో మెరిసి పోతూ ఉంటుంది. ఆ ప్రాంగణంలోనే 1,0008 లింగాలు,పార్వతీ దేవి,గణపయ్యలు కూడా దర్శనం ఇస్తారు.
ఈ ఆలయంలో రోజూ ప్రొద్దుట 7 గంటలకు భక్తులు స్వయంగా శివలింగాన్ని అభిషేకం చేసుకుని తరిస్తారు.ఈ అవరణలోనే శ్రీ శివశక్తి సాయి మహా ధుని కూడా దర్శనం ఇస్తుంది.భక్తులు కోరికతో వచ్చి ప్రదక్షిణం చేసి ముక్తి పొందుతారు.
కార్తీక మాసంలో తప్పకుండా భక్తులు పూజించిన  శివయ్య అనుగ్రహం కలగడం విశేషం.
నిత్య ప్రసాదం : కొబ్బరి, పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.

          -తోలేటి వెంకట శిరీష

Leave a comment