ఇప్పటికీ పెద్ద ఫంక్షన్స్ కోసం కట్టెల పొయ్యిలపైనే ఆహారం వండుతుంటారు. ఇలా కట్టెలపైన వండినవి రుచిగా ఉంటాయన్న అపోహా కొద్దీ వంట చేస్తూ ఉంటారు.కానీ ఇది ప్రాణహానికి దారి తీస్తుందంటున్నారు చైనా పరిశోధకులు.కట్టెల పొయ్యి ఉపయోగించటం వల్ల ఆ పొగ శ్వాసకోశాలోకి వెళ్ళి శ్వాస కోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం రెండు రేట్లు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య పొయ్యికి దగ్గరగా పని చేసే స్త్రీలకే ఎక్కువ కనుక వారికి ఆ కట్టెల పొయ్యిపైన వంట ఆపేయాలని సూచిస్తున్నారు.

Leave a comment