లక్ష్మీ పూజ కోసం అందరు ఒక రూపుని తిసుకుంటారు. బంగారపు రూపుని పూజ అయ్యాక మెడలో మంగళసూత్రానికి కట్టుకుంటారు.ఇప్పుడి రూపు రూపం మార్చుకుని అచ్చంగా లక్ష్మిదేవి రూపులు నెక్లెస్ గా అయిపోయింది.ముత్యాలు,రత్నాలు,సీజెడ్స్,నవ రత్నాలు కలిపి ఈ రూపులతో తయారు చేసిన నెక్లెస్ లు ఎంతో బావున్నాయి.కాసుల చుట్టు రాళ్ళు పువ్వులు డిజైన్ చేసి యాధావిధిగా లక్ష్మీ రూపాన్ని కాసు పైన ముద్రించి నెక్లెస్ లు గాజులు వడ్రాణాలు,చెవి దిద్దులు చేస్తున్నారు.ఈ శ్రావణ మాసం కోసం ప్రత్యేకంగా తయారైన నగలివి.

Leave a comment