బెంగళూర్ లోని మానసిక విద్యార్థుల పాఠశాలలో టీచర్ లక్ష్మి కళ్యాణ్ సుందరం వయసు 91. ఆమె భర్త చనిపోయాక 67 వ ఏట చేరారామె. ఈ వయసులో ఉద్యోగం ఎలా చేస్తున్నారు అంటే నేనెప్పుడు పని చేయలేదు ,నాశక్తి అంత నాలోనే వుండి పోయింది అంటారామె నవ్వుతూ. ఆమె పెళ్ళయ్యాక కుటుంబ భాద్యతల్లోనే ఉన్నారు. భర్త పోయాక ఆ జ్ఞాన కలల్లోంచి బయట పడేందుకు ఉద్యోగం ఎంచుకొన్నారామె .ఏ వయసు అయినా స్వయం శక్తితో నిలబడేందుకు అడ్డం కాదని నిరూపించారు లక్ష్మి. ఓపిక ఉన్నంత కాలం తన పనులు,తన ఉద్యోగం తనకు తోడుగా వుండాలను కొంటారు లక్ష్మి. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు,ఐదుగురు మనవరాళ్ళు ఇద్దరు మునుమానవరాళ్ళు .

Leave a comment