డిస్పోజబుల్ మాస్కుల కన్నా ఉతికి మళ్ళీ మళ్ళీ వాడుకొనే మాస్కులే మంచిదని నిపుణులు చెపుతున్నారు . ప్రధాని మోదీ కూడా ఇంటి దగ్గరే మాస్కులు కుట్టుకోవాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు .ఈ గడ్డు రోజుల్లో మనమంతా సమాజం కోసం అంతో, ఇంతో సేవ చేయాలి .ఇప్పుడు నా భార్య , కూతురు ఇతరుల కోసం మాస్కులు కుట్టే పనిలో పడ్డారు .వాళ్ళేం పనిమంతులు కాదు కానీ ఉన్నా నైపుణ్యానికి మెరుగు పెట్టుకొనేందుకు వాళ్లలో గొప్ప పని దొరికింది అని ట్వీట్ చేశారు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ .ఆయన భార్య మృదుల కూతురు నైమిష తెల్లని గుడ్డతో కుట్టు మిషన్ తో మాస్కులు కుడుతున్న దృశ్యాన్ని అయన ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు .

Leave a comment