ఢిల్లీకి చెందిన 63 సంవత్సరాల రేణు గుప్త  గత 15 సంవత్సరాలుగా పరిసరాలను శుభ్రం చేస్తూనే ఉంది. డంప్ యార్డులు గా మారిన ప్రభుత్వ ఖాళీ స్థలాలు పిల్లల ఆటస్థలాలు గా పచ్చిక మైదానాలు గా మార్చేసింది. తనతో పాటు పలుగు పార మొక్కలు తీసుకుపోతుంది. అలాగే ఉత్తర ఢిల్లీలోని నానక్ పియావో సాహిబ్ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రం చేసింది. కనపడిన ప్రతి గోడని పెయింటింగ్స్ తో నింపేస్తుంది రేణు గుప్తా. మనం ఓ అడుగువేస్తే మనతో కలిసి నడవటానికి మరి కొన్ని అడుగులు జత కలుస్తాయి నేను పని మొదలు పెట్టగానే ఎంతో మంది నాతో కలుస్తారు అంటుంది రేణు గుప్తా.

Leave a comment