ఇంట్లో ఇప్పుడు రాగి పాత్రలు మంచి నీటి జగ్గుల వాడకం మొదలు పెట్టారు.రాగి పాత్ర ల్లో ఉంచిన నీళ్ళు ఆరోగ్యం అంటున్నారు.అలా ఇతర లోహాలతో చేసిన పాత్రలు వెండితో చేసిన వస్తువులు హాయిగా వాడుతున్నారు. కానీ వీటిని క్లీన్ చేయటం చాలా కష్టం.చింతపండు ,బయట దొరికే పౌడర్లతో కడిగితే కాసేపటికే వాటిపైన మరకలు కనిపిస్తాయి. తరిగేశాక మిగిలిన ఆకు కూరల కాడలు ,ఆకులు మెత్తగా చేసి కుంకుడు కాయపొడి ,శీకాయి పొడి కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులు శుభ్రం చేస్తే మెరుస్తూ ఉంటాయి.మార్కెట్ పౌడర్ల కంటే ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది.

Leave a comment