ప్రపంచంలోనే మనాలి నుంచి లేహ్‌ వరకు సాగిన ఆల్ట్రా మారథాన్‌ పూర్తి చేసిన తొలి మహిళ రన్నర్ గా చరిత్ర సృష్టించింది సూఫియా ఖాన్. ఆమె స్వస్థలం రాజస్థాన్ లోని అజ్మీర్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. 2018లో 720 కిలోమీటర్ల గోల్డెన్ ట్రయాంగిల్ రన్ 16 రోజుల్లో పూర్తి చేసి జాతీయ రికార్డ్ తిరగ రాసింది. తరువాత కాశ్మీర్ టు కన్యాకుమారి,అలాగే స్వర్ణ చతుర్భుజాని చుట్టిన ఫాస్టెస్ట్ రన్నర్ గా నిలిచింది సూఫియా.అండర్ అజ్మీర్ సంస్థతో కలసి ఎన్నో మారథాన్‌ లు చేసింది. ఇటీవలే పూర్తిచేసిన మనాలి టు లేహ్‌ ఆమె సాహస యాత్ర. త్వరలో భూప్రదక్షిణ చేస్తానంటోంది సూఫియా ఖాన్.

Leave a comment