మీటూ స్ఫూర్తితో నటులు ,గాయకులు ,జర్నలిస్టులు తమ కెదురైన వేధింపులు బయటపెడుతున్నారు. ఢిల్లీకి చెందిన సినీ ఫోటో గ్రాఫర్ ప్రీతికామేనన్ ,ప్రముఖ కథానాయికుడు ప్రశాంత్ తండ్రి త్యాగ రాజన్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది.ఈ విషయం తన ఫేస్ బుక్ లో వెల్లడించింది. పొన్నన్ శంకర్ చిత్రానికి నేను ఫోటో గ్రాఫర్ గా పని చేశాను. కోయంబత్తుర్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినంత కాలం త్యాగ రాజన్ నన్ను రకరకాలుగా వేధించాడు. థాయ్ లాండ్ లో మసాజ్ బార్ లో తాను అమ్మాలతో ఉన్న ఫోటోలు చూపించేవాడు. అర్థరాత్రి నా గది తలుపులు కొట్టే వాడు. అక్కడ ఉన్నన్ని రోజులు నేను భయపడుతూనే గడిపాను అన్నరామే.

Leave a comment