దేశంలో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తొంది.చిత్రసీమలో చర్చలన్ని మీటూ ఉద్యమం గురించే ఫిమేల్ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయలకు చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటే సహా నటినటులు మధ్యలో పలుకుతున్నారు.తాజాగా బాలీవుడ్ నుంచి 11 మంది మహిళా దర్శకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇండస్ట్రీలో లైంగిక హింసలకు పాల్పడిన వారితో ఇక పై తాము పని చేయమని తేల్చి చెప్పారు. 11 మంది మహిళా దర్శకులు సంతకం చేసిన నోట్ సోషల్ మీడియాలో విడుదలయింది. ఈ నోట్ పై
గౌరీ షిండే,కిరణ్ రావు,కొంకణా సేన్ ,నందితా దాస్, నిత్యమెహ్రా,రుచినారాయణన్,సొనాలి బోస్,జోయా అక్తర్,అలోక్ శ్రీ వాత్సవ తదితర దర్శకులు సంతకం చేశారు.

Leave a comment