అనిమిషేంద్రులు మునులు దిక్పతులమరకిన్నెర సిద్దులూ…క్రమముతో మీ కొలువు కిపుడు కాచినారెచ్చరికయా…కొలచినారెచ్చరికయా..

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ పతి వల్లభా!!
ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా!! వైష్ణవాలయాలను అంగరంగ వైభవంగా అలంకరిస్తారు.స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు.విష్ణు మూర్తి దర్శన భాగ్యం కోసం ముపై మూడు కోట్ల మంది దేవతలు తరలి వస్తారు.ఈనాడు స్వామి వారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు.ముక్కోటి ఏకాదశి నాటి దర్శనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
రోజంతా ఉపవాస దీక్షతో శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని 108 సార్లు స్మరించిన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పులగం

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment