తాజా నిమ్మరసాన్ని వేడి నీళ్ళలో కలిపి తాగితేనే సీ విటమిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు అంటారు డాక్టర్లు.చలి కాలంలో ఉదయాన్నే ఇలా తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. ఉక్కపోత అధికమైతే చల్లని నీళ్ళలో తాగాలని చూస్తారు కానీ పరగడుపున చల్లని నీళ్ళు తాగడం వల్ల కాలేయం సరిగ్గా పని చేయదు.దానిలో చురుకుదనం తేవడం కష్టం.నిమ్మరసం తాగినందువల్ల వచ్చే లాభాలు ఏవి కలగవు.అదీ కాక జీర్ణకోశం కూడా ఇబ్బంది పడుతుంది. అందుచేత ఎలాంటి వాతావరణంలోనైన వెచ్చని నీటితోనే నిమ్మరసం తాగాలి.ఇందులో పుష్కలంగా కాల్షియం,పాస్పరస్,మెగ్నీషియం ఉంటాయి.

Leave a comment