రోజు మొత్తం మీద వీలైనప్పుడల్లా పండ్లు ,కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకొంటే మంచిది . ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లో ఎదో ఒక పండు జత చేస్తే మేలు జరుగుతోందని శాస్రవేత్తల అభిప్రాయం . అలాగే మధ్యాహ్నం వేళలో రాత్రి డిన్నర్ లో ఎదో పండు తినాలని చెపుతున్నారు . భోజనం తరువాత టమోటా, దోస వంటి ముక్కలు కలపిన సలాడ్ తినాలి . సాయంత్రం వేళ స్నాక్ గా కూడా ఇవే తీసుకోవటం బెటర్ . ప్రతి రోజు మూడు సార్లు నాలుగు వందల గ్రాముల కూరగాయలు కనీసం రెండు వందల గ్రాముల పండ్లు తప్పని సరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు .

Leave a comment