ఈ మధ్య కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ తప్పనిసరిగా విటమిన్-డి సప్లిమెంట్లను వాడమంటున్నారు వైద్యులు.ఈ మధ్యకాలంలో చేసిన ఒక అధ్యయనంలో విటమిన్-డి లోపం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కోవిడ్ బారిన పడినట్లుగా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ రోగుల్ని పరిశీలించగా వాళ్ల ప్లాస్మా లో విటమిన్-డి తక్కువగా ఉంది.కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ విటమిన్-డి శాతం తక్కువే ఉంది కనుక కాస్తయినా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోమంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment