స్నానం మససుకి హాయి నివ్వటం తో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని తెలసు . కానీ బాగా ఒత్తిడి గా ఉన్న సమయంలో సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్ల రసాలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి మాయం అవుతుంది అంటున్నారు నిపుణులు . ఎన్నో పరిశోధనల అనంతరం ఈ విషయం నిరూపితం అయింది . నిమ్మ ,అరేంజ్ ,ద్రాక్ష పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది . ఇది చర్మం లోపలి వరకు వెళ్ళి మలినాలను శుభ్రం చేస్తాయి . ఈ పండ్లరసం కలిసిన నీళ్ళు స్నానం చేస్తే ప్రశాంతత కలిగి ఒత్తిడి తగ్గుమొహం పట్టటం కాకుండా చర్మం నిగారింపుగా ఉంటుందంటున్నారు .

Leave a comment