బరువు తగ్గాలనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది కానీ బరువు పెరగాలనుకొనే వారు కూడా ఉంటారు. అందుకు ప్రధానంగా పాటించవలసిన సూత్రాలు ఉంటాయి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. ప్రతి భోజనం తర్వాత పాలతో చేసిన డిజర్ట్ లేదా స్వీట్ తినాలి.  డ్రైఫ్రూట్ లడ్డు, నువ్వుల ఉండలు, కలకండ పాయసం వంటివి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ రెండు భాగాలుగా ఉదయం ఒక సారి 11 గంటల కొకసారి తింటూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం భోజనం రెండు భాగాలు చేసి ఒంటి గంటకు ఒకసారి మూడు గంటలకు పెరుగన్నం తినాలి. కాఫీ, టీ ల బదులు శక్తి నిచ్చే పానీయాలు తాగాలి. అప్పుడే తీసిన జ్యూస్,ఖర్జూరాలు,పండ్లు,కూరగాయలు మొదలైనవి ఆరోగ్యాన్నిస్తాయి. కాస్త వ్యాయామం చేస్తే బలం,బరువు పెరుగుతారు.

Leave a comment