బీహార్ లోని ముంగేర్ జిల్లాకు చెందిన బినా దేవి తన ఇరుకైన గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నది. బాగల్ పూర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకం లో శిక్షణ తీసుకుని వాటిని పెంచడం ప్రారంభించిన బినా దేవి సంవత్సరానికి లక్షలు ఆర్జిస్తోంది. ఆమెను మష్రూమ్స్ లేడీ అంటారు. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి కిసాన్ అభినవ పురస్కారం అందుకున్నది. తన చుట్టూ ఎందరో మహిళలకు పుట్టగొడుగుల పెంపకం లో శిక్షణ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం, అక్షరాస్యత ఉద్యమ స్థాయిలో పనిచేస్తోంది బినా దేవి.














