దుర్గవ్వ పాడిన అడవితల్లి పాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది పల్లె పాటను ప్రాణం పెట్టి పాడే దుర్గవ్వ పాటకు ఎంత గుర్తింపు వచ్చింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యల పల్లె గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ కూలీ పనులు చేసి జీవిస్తోంది. కాయకష్టం చేస్తూ పాడే పల్లె వరాలు ప్రవేట్ ఆల్బమ్ గా వచ్చాయి. అట్లా పాడిన పాటల్లో సిరిసిల్ల చిన్నది నాయితల్లే  ఉంగరమే రంగైనా రాములాల టుంగురమే  పాటలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. టాలెంట్ ఉంటే ఏ మూల ఉన్న అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని దుర్గమ్మ నిరూపించింది.

Leave a comment