బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియా ఫ్యాక్ట్ క్విజ్ ఛాంపియన్ షిప్ 2020 పోటీల్లో 21 సంవత్సరాల రాజ్ ప్రియ విజేత గా నిలిచింది.మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ ప్రియ భారతి జబల్ పూర్ లో బి.బి.ఎ పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది పాల్గొన్న ఈ క్విజ్ పోటీలో గెలిచి దేశంలోని తొలి ఫ్యాక్ట్ ఛాంపియన్ అయింది.సామాజిక పరమైన అంశాలతోపాటు లింగవివక్ష జనాభా.., వాతావరణంలో మార్పు ఆరోగ్యం ప్రభుత్వ నియమాలు వంటి పలు అంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు ఈ క్విజ్ లో ఉన్నాయి.

Leave a comment