చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లో వివిధ విభాగాల్లో 54 మంది మహిళలు పని చేశారు.విక్రమ్ లాండర్ సురక్షితంగా చంద్రుడిపై దిగేలా రూపొందించిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కీలక శాస్త్రవేత్తల బృందం లో మానస ఒకరు. గుంటూరు జిల్లా కు చెందిన బొల్లు మానస 2014లో బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరారు. చంద్రాయన్-2 కి తన సేవలు అందించారు.ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో సూర్యుని పైకి త్వరలో ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్-1 లో పని చేస్తానని చెబుతున్నారు మానస.

Leave a comment