ఒకే ఇంట్లో ఏడుగురు తోబుట్టువులు బీహార్ పోలీస్ శాఖలో కొలువు సాధించారు. ఈ అక్కాచెల్లెళ్లకు బీహార్ లోని  సరన్ జిల్లా కేంద్రం. పిండి మిల్లు నడిపే రాజ్ కుమార్ సింగ్ కూతుళ్లు. ఉండేందుకు ఇల్లు వసతులు లేకున్నా సింగ్ ఏడుగురు అమ్మాయిలను చక్కగా చదివించాడు. ఏడుగురు కూతుళ్లు చక్కగా చదువుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించారు. క్రైమ్ బ్రాంచ్, ఎక్సైజ్, సి.ఆర్.పి.ఎఫ్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాలు సాధించి తండ్రి కోరిక నెరవేర్చారు ఏడుగురు ఆడపిల్లలు.

Leave a comment