చర్మం చక్కగా మెరిసేందుకు ఈ మిశ్రమం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్క ను చిన్న ముక్కలుగా చేసి రెండు స్పూన్ల బియ్యంతో కలిపి గిన్నెలో బాగా ఉడికించాలి. అన్నం లాగా ఉడికిన ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి వడకట్టాలి. ఇప్పుడీ గుజ్జులో చెంచా చొప్పున మొక్కజొన్న పొడి, నిమ్మరసం, నారింజ రసం, పాలపొడి వేసుకుని బాగా కలపాలి. దాన్ని పొడి సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో వారం రోజుల పాటు భద్రం చేసుకోవచ్చు. ముఖం శుభ్రం చేసుకొని ఈ మిశ్రమాన్ని లేపనం లాగా పూసి అరగంట ఆరనిచ్చి కడిగేస్తే చాలు చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే మెడ చేతులు మోచేతుల వద్ద రాస్తే నలుపుదనం పోతుంది.

Leave a comment