నీటి శుద్ధి ప్లాంట్ ల నిర్వహణ బాధ్యత తీసుకుంది మాన్సీ జైన్. ఆమె తన తండ్రి రాజేష్ తో కలిసి స్థాపించిన ‘డిజిటల్ పానీ’ యాప్ ద్వారా ఐ ఓ టి సాంకేతికతలు ప్లాంట్స్ ని సంరక్షిస్తారు ఈ టెక్నాలజీ ని నీటి డాక్టర్ గా చెబుతారు మాన్సీ. భారత దేశంలో 90 వేల నీటి శుద్ధి ప్లాంట్ లు ఉన్నాయి వాటి నిర్వహణ, ఆపరేషన్స్ చాలా కష్టం సరైన నిపుణులు లేకపోవడం సమస్య. డిజిటల్ పానీ ఈ ప్లాంట్స్ లో సెన్సార్లు అమర్చి వాటి పనితీరు తెలుసుకొని అవి దశాబ్దాల పాటు చక్కగా పనిచేసే లా సలహాలు ఇస్తోంది. 9 కోట్ల లీటర్ల శుద్ధి చేస్తోందనే సమాచారం తో మాన్సీ కి 8 కోట్ల పెట్టుబడి తో పాటు కార్డియర్ విమెన్స్ ఇనిషియేటివ్ ఫెలోషిప్ అందజేశారు.

Leave a comment