తాళి కట్టించుకున్న భార్యే అయినా ఆమె వయసు 18 ఏళ్ల లోపుగా ఉంటె భర్త ఆమెతో కాపురం చేయటం అత్యాచారం కిందకే వస్తుందని అది నేరమనీ సుప్రీం కోర్ట్ స్పష్టంగా ప్రకటించింది. ఆ అంశం పై చాలా కాలంగా వస్తున్న వివాదానికి తెరదించింది. బుధవారం నాడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మకమైన తీర్పును హైకోర్ట్ జస్టిస్ మదన బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం స్పష్టంగా వెలువరించింది. అక్షయ తృతీయ నాడు వేలాది మంది మైనర్ బాలికలకు సామూహికంగా వివాహాలు జరగటం పట్ల ధర్మాసనం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బాల్య వివాహాలు నిషేధించాలని ధర్మాసనం సూచించింది.

Leave a comment