ఈ కరోనా కాలంలో నలభై రోజులుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క అడవి లో తిరుగుతున్నారు. రాళ్ళు రప్పలు పట్టించుకోకుండా నిత్యావసర వస్తువులు మోస్తూ గిరిజన కోనలో పర్యటిస్తున్న సీతక్క ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎర్రని ఎండలో నడుస్తూ అనుచరులతో కలిసి వెళ్ళి అడవి బిడ్డలకు బియ్యం నిత్యావసర వస్తువులు అందించటం మొదలు పెట్టారు. ములుగు నియోజక వర్గం కొత్తగూడ,తడ్వాయ్, మంగపేట తదితర మండలాల్లో చిన్న చిన్న గూడేలకు సరైన రహదార్లు లేవు అలాటి ప్రాంతాలకు ఎడ్ల బండి,ట్రాక్టర్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు సీతక్క.

Leave a comment