కేరళ లోని వృద్దాశ్రమంలో మొదటిసారి ఒక పెళ్ళి జరిగింది 65 సంవత్సారాల లక్ష్మి అమ్మాల్,67 సంవత్సారాల కొచ్చానియన్ వధూ వరులై ఘనంగా పెళ్ళి చేసుకున్నారు. కేరళ మంత్రి శివ కుమార్ ఈ వివాహానికి హాజరై ఆ వధూవరులను అభినదించారు లక్ష్మి అమ్మాల్ కు కొచ్చానియన్ 30 ఏళ్ళుగా తెలుసు. ఆమె దెగ్గర పని చేసేవాడు. లక్ష్మి భర్త 20 ఏళ్ళ క్రితం మరణించారు ఆమె బంధువుల దెగ్గరే ఉంటూ రెండేళ్ళ క్రితం వృద్దాశ్రమానికి వచ్చింది కొచ్చానియన్ అదే ఆశ్రమంలో ఆరేళ క్రితం జాయిన్ అయ్యాడు. ఇద్దరు ఇన్నాళ్ళ తర్వాత కలుసుకొని స్నేహంగా ఉండి తోడుకోసం పెళ్ళి చేసుకోవాలి అనుకొన్నారు. వృద్ధాశ్రమం వాళ్ళు సంతోషంగా పెళ్ళి చేశారు. పైగా వాళ్ళకు స్పెషల్ రూం కూడా ఇచ్చేశారట.

Leave a comment