గోరు వెచ్చని పాలు నీళ్ళలో చిటికెడు పసుపు,దాల్చిన చెక్క పొడి వేసి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.వేడి పాలలో పసుపు కలిపి తీసుకుంటే,పసుపులో ఉండే కార్క్ మిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు సమ కూరుతాయి  అంటున్నారు. అయితే కొబ్బరి పాలలో పసుపు వేసి తాగితే ఇంకెంతో ప్రయోజనం,అనీ, ముఖ్యంగా శీతాకాలమో ఈ పానీయాల వల్ల మరింత మేలు జరుగుతుందనీ సెలబ్రిటీలకు డైటీషియన్ లు గా ఉన్న న్యూట్రిషనిస్ట్ లు చెపుతున్నారు. ఉదయాన్నే పసుపు,దాల్చిన్ చెక్క పొడి వేసిన వేడిపాలు తాగితే రోగనిరోధక శక్తి గణీయంగా పెరుగుతుందనీ ముఖ్యంగా కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయని చెపుతున్నారు. వయసు మీద పడ్డాక వచ్చే వ్యాధులకు కూడా ఈ కార్క్ మిన్ ఔషధం లాంటి దాని చెపుతున్నారు.

Leave a comment