శైవ క్షేత్రాలలో ప్రసిద్ధ చెందిన ఆలయం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం.
తెలంగాణా రాష్ట్రం,కరీంనగర్ జిల్లా,హుజూరాబాద్ గ్రామానికి సమీపంలో వున్న కొత్తకొండ వీరభద్ర స్వామిని కార్తీక మాసంలో దర్శనం చేసుకుని పునీతులవుదాము పదండి.
ఇక్కడ శివుడు లింగరూపంతో కాకుండా కోరమీసాలతో ప్రత్యక్షమవుతాడు.
కలప కోసం జనులు అడవికి ఎడ్లబండ్లతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఎడ్లు మాయమై అడవిలోనే బస చేయాల్సి వచ్చింది. వారి కలలో శివయ్య వచ్చి నేను ఈ ప్రదేశం లో వున్నాను తనని బయటకు తీసి గుడిలో ప్రతిష్ఠ చేయమని ఆదేశించాడు.స్వామి వారి ఆరాధన ఎంతో పుణ్యం.సంతానం లేనివారికి
తప్పక సంతానం కలుగుతుంది.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.

                -తోలేటి వెంకట శిరీష

Leave a comment