ఒడిసా లోని భద్రక్ జిల్లా కురుడ కు చెందిన ఛాయా రాణి సాహూ ,భర్త సర్వేశ్వర్ సాహూ తో కలిసి తమకున్న ఏడు ఎకరాల భూమిలో గత 25 సంవత్సరాలుగా కూరగాయల సాగు,ఇరవై ఆవుల పాడీ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా పేదలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడుతూ ఉండటంతో, వారికి అండగా ఉండాలనుకొని తన పొలం లో పండిన కూరగాయలను ఉచితంగా అందిస్తోంది .సొంత గ్రామమైన కురుడ తో పాటు చుట్టు పక్కల  భైరాపూర్,అలబగ,లుంగ, బ్రాహ్మణ గావ్,   తదితర పదిహేను గ్రామాల్లోని  ప్రజలకు ఈ  కూరగాయలు అందుతున్నాయి.వీటిని పంపిణీ చేసేందుకు ఛాయా రాణి ప్రత్యేకంగా ఓ వాహనాన్ని అద్దెకు తీసుకుంది.

Leave a comment