మొఖం చల్ల నీళ్ళతో కడిగితే చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా నీళ్లతో కడిగితే మాత్రం చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం పోతుంది.ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే చర్మం పొడిబారి పోతుంది. చర్మం తేమగా తాజాగా కనిపించాలి అంటే స్నానం చేసే ముందు బాదం నూనె ముఖానికి పట్టించాలి అలా పట్టించి ఓ గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి.ఆ తర్వాత గిన్నెలో నీళ్ళు మరిగించి వేడి నీటి ఆవిరిపట్టాలి. తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే ఎంతో తేటగా తాజాగా కనిపిస్తారు.

Leave a comment