ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం లో వెలసింది శ్రీ కొండాలమ్మ అమ్మవారు.కొండరాయి అమ్మవారుగా పూజలందుకుంటోంది.
పూరాతన కాలంలో ఒక ప్రదేశం నుండి కొండ రాళ్ళను తీసుకొని చేయవలసిన ప్రదేశం లో దింపుతున్న సమయంలో ఒక కొండ రాయి అమ్మవారి రూపంలో కనిపించిన దానిని ప్రక్కన పెట్టి పసుపు కుంకుమతో ఆరాధించారు.ఒకనాడు బాతుల వ్యాపారి కొండ రాయి వద్ద కుటీరం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆ తల్లి చల్లని చూపుల దయతో వ్యాపారంలో లాభాలు కలిగిన కొండలమ్మ దయ అని పూజలు చేసి ముక్తి పొందాడు. నిత్యం కొండలమ్మ కు భక్తులు తమ కోరికలు తీర్చే దేవతగా భావించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తరిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,కోడి.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment