టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికయింది మను బాకర్. ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి ఒకేసారి షూటింగ్ లో మూడు విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సల్ స్కూల్ నడిపే తల్లి సుమేధ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్లోనే షూటింగ్ లో శిక్షణ పొందింది మను బాకర్.తిరువనంతపురం జాతీయ పోటీల్లో ఒకేసారి 15 పతకాలు గెల్చుకుంది .ప్రస్తుతం ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో బి ఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న మను జూలై లో జరిగే ఒలంపిక్స్ కు సిద్ధం అవుతోంది ఒలంపిక్స్ లో ఒకేసారిగా ఒకే క్రీడా నుంచి మూడు విభాగాల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది మను బాకర్.

Leave a comment