కష్ట కాలం వస్తే ఎవళ్ళూ చేతులు కట్టుకొని తీరిగ్గా కూర్చోలేదు .ఎదో పని చేసి ఇతరులకు సాయపడాలనే చూస్తారు . బీజేపీ ఎంపీ సంగీత కుమారి సింగ్ దేవ్ ఇంట్లోనే కుట్టు మిషన్ పైన స్వయంగా మాస్క్ లు కుట్టడం మొదలుపెట్టారు.చుట్టూ ఉన్న పేద కుటుంబాల వారికి పంచిపెడుతున్నారు .ఒడిస్సా లోని బోలంగీర్ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోలంగీర్ సంస్థాన పూర్వపు రాజ వంశీకుడైన ఆమె భర్త కనక్ వర్ధన్ సింగ్ మాజీ ఎమ్మెల్యే . భార్యాభర్తలిద్దరూ ఈ కరోనా సమయంలో ప్రజల అవసరాలకు ఎన్నో నిధులు సాయం చేస్తున్నారు .అత్యవసరమైన సమయం ఇది .ఎవరికి తోచినంత సాయం వారు చేయండి అంటూ ట్విట్ చేశారు సంగీత కుమారి .

Leave a comment